వైఎస్ జగన్ అసెంబ్లీని తాడేపల్లి ప్యాలెస్ అనుకుంటున్నారని మంత్రి సంధ్యారాణి విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అడగడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారని తెలిపారు. రాజ్యాంగం గురించి జగన్ మాట్లాడడం మిలీనియం జోక్ అని అభివర్ణించారు. ప్రజా సమస్యలు విస్మరించినందుకే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని తెలిపారు. అసలు 11 సీట్లు వచ్చిన పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ప్రశ్నించారు.