AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు మిర్చి యార్డ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా మిర్చి రైతులతో ఆయన మాట్లాడుతున్నారు. రైతులను కలిసి వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రత కల్పించలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే.