AP: కూటమి పవర్లోకి వచ్చినప్పటి నుంచి జనసేనాని రాయలసీమపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల నాటికి ఆ నాలుగు జిల్లాలను తన సైన్యంగా మార్చుకునే వ్యూహం అమలు చేస్తున్నారు. అందుకోసం జగన్ కంచుకోట రాయలసీమ మీద ఫోకస్ పెట్టిన పవన్.. పుంగనూరు నుంచి జంగ్ సైరన్ ఊదారు. రాయలసీమ జిల్లాలో వైసీపీ తిరిగి కోలుకోకుండా పవన్ ప్లాన్ చేస్తున్నారు. జగన్ తర్వాత వైసీపీలో అతిపెద్ద లీడర్గా చెప్పుకునే పెద్దిరెడ్డి ఇలాకా పుంగనూరులో జనసేన భారీ సభ నిర్వహించడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.