AP: ఇటీవల తిరుపతిలో ఉత్తర ద్వార దర్శనం టికెట్ కౌంటర్ వద్ద తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్క్ను హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఆదివారం పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన పాటు సంబంధిత అధికారులు కూడా అక్కడికి చేరుకుని, పార్క్ సమీప ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.