కువైట్ లో గోపవరం వాసి మృతి

4663చూసినవారు
కువైట్ లో గోపవరం వాసి మృతి
బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని చిన్న గోపవరం గ్రామానికి చెందిన బుర్రి వరదరాజు (45) గుండెపోటుతో శనివారం కువైట్లో మృతిచెందాడు. వరదరాజు బ్రతుకు తెరువు కోసం కువైట్ కు వెళ్లాడు. శనివారం గుండె నొప్పి వస్తుందని తోటి వారితో చెప్పగా చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలింస్తుండగా మృతిచెందినట్లు కుటుంబ సభ్యులకు వారు సమాచారం అందించారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు.

సంబంధిత పోస్ట్