ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి కుమారుడు దేవసాని ఆదిత్య రెడ్డికి వైసీపీలో కీలక పదవి లభించింది. ఆయన వైస్సార్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా శనివారం నియోజకవర్గ నేతలు ఆదిత్య రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.