ఆధార్ కార్డులను ట్యాంపరింగ్ చేసి అక్రమ రిజిస్ట్రేషన్ చేశారని.. దళితుల ఫిర్యాదు మేరకు బద్వేల్ వైస్ ఛైర్మన్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. 20 రోజులుగా పరారీలో ఉన్న గోపాలస్వామిని హైదరాబాదులోని హోటల్లో అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. బద్వేల్లో దళితుల భూముల ఆక్రమణపై ఎస్సీ, ఎస్టీ కేసులో అరెస్టు చేసినట్లు మైదుకూరు డిఎస్పీ రాజేంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు.