బద్వేలు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కిందపడి గంధం శెట్టి నరసింహులు (70) అనే వృద్ధుడు మృతి చెందారు. గురువారం పోరుమామిళ్ల మండలం గానుగ పెంట చెందిన ఇతను చల్లగిరిగెల - బద్వేలు బస్సులో బద్వేలు పట్టణానికి వచ్చారు. బస్టాండు ఉత్తర వైపు ఉన్న గేటువద్ద రోడ్డు దాటుతుండగా తాను ప్రయాణించిన చల్లగిరిగెల - బద్వేలు ఆర్టీసీ బస్సే మలుపు తిరుగుతుండగా అదుపుతప్పి నరసింహులును ఢీకొనడంతో మృతిచెందారు.