కడప జిల్లా ఖాజీపేట పట్టణ పరిధిలోని టీటీడి కళ్యాణ మండపం వద్ద.. కాజీపేట-మైదుకూరు రోడ్డుపై గుంత ఏర్పడడంతో.. ప్రజలు వినతి మేరకు అధికారులు మరమ్మతులు చేసి, స్పీడ్ బ్రేకర్ లాగా ఏర్పాటు చేశారు. దీనివల్ల ఇటీవల కొందరు ప్రమాదానికి గురయ్యారు. అధికారులు స్పీడ్ బ్రేకర్ సూచిక గాని, తెల్ల లైన్ల సూచికలు గాని ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.