బద్వేల్ పట్టణంలో సుపరిపాలనలో తొలి అడుగు నాలుగో రోజు కార్యక్రమం శనివారం నిర్వహించినారు. బద్వేల్ మున్సిపాలిటీ 23వ వార్డు రామాంజనేయ నగర్ టీడీపీ యువనాయకుడు రితీష్ కుమార్ పర్యటించారు. గడప గడపకు తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.