మంత్రి లోకేశ్ కు బీజేపీ యువజన విభాగ రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లెల శ్రావణ్ కుమార్ రెడ్డి బుధవారం కృతజ్ఞతలు తెలిపారు. బద్వేల్ నియోజకవర్గంలోని కాశినాయన మండలంలోని కాశినాయన ఆశ్రమం అన్నదాన సత్రం కూల్చివేతపై స్పందించి, తమ సొంత నిధులతో అన్నదాన సత్రం నిర్మిస్తానని హామీ ఇచ్చినందుకు మంత్రి లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆశ్రమంపై మరోసారి ఇలా జరగకుండా కూటమి ప్రభుత్వం చొరవ చూపాలని ఆయన కోరారు.