కడప జిల్లా బద్వేల్ - సిద్దవటం ప్రధాన రహదారిలో నివసిస్తున్న ఫణీంద్రరెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో చేసిన చర్యలని బాధితుడి తండ్రి పోలి రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. తాను జడ్పీటీసీగా ఉన్నానని టీడీపీలో చేరమని ఒత్తిడి తెచ్చినా అంగీకరించకపోవడంతోనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.