ద్విచక్ర వాహనం నుండి పడి మహిళ మృతి

66చూసినవారు
ద్విచక్ర వాహనం నుండి పడి మహిళ మృతి
ద్విచక్ర వాహనంలో నుండి కింద పడి మహిళా మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు యర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని ప్రకాష్ నగర్ సమీపంలో ద్విచక్ర వాహనం నుండి ప్రమాదవశాత్తు కిందపడి మహిళా మృతి చెందింది.
మృతురాలు చాపాడు మండలం మడూరు గ్రామానికి చెందిన దేవమ్మ (52) గా గుర్తించారు. తలకు తీవ్ర గాయం కాగా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్