టిడిపి కార్యాలయంలో అగ్ని ప్రమాదం

68చూసినవారు
జమ్మలమడుగు లోని తెదేపా కార్యాలయం స్వల్పంగా అగ్ని ప్రమాదానికి గురైందని ఇన్చార్జి ఫైర్ స్టేషన్ అధికారి ప్రకాష్ రావు తెలిపారు. మంగళవారం రాత్రి వినాయకుడి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళుతుండగా యువకులు బాణాసంచా కాల్చే సమయంలో నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయన్నారు. కార్యాలయం పైకప్పు ఇనుప రేకులు ఉండగా వాటిపైన బోధ ఉన్నట్లు తెలిపారు. బోధ కాలుతుందని తమకు సమాచారం అందడంతో వెళ్లి మంటలను ఆర్పామని ఎలాంటి నష్టం జరగలేదన్నారు.

సంబంధిత పోస్ట్