సాక్షి ఛానల్ లో అసభ్యకర భాష వాడిన పాత్రికేయులు తమ తప్పును తెలుసుకొని క్షమించమని అడిగాక వదిలేయకుండా కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదని వైసీపీ ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి తెలిపారు. జమ్మలమడుగు పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తమ తప్పును తెలుసుకొని క్షమించమని చెప్పినా దాన్నే ఆసరాగా చేసుకుని నాన్ బెయిలబుల్ కేసు పెట్టి వేధించడం సరికాదన్నారు.