జమ్మలమడుగు నియోజకవర్గ కొండాపురంలోని ఎస్బీఐ బస్ స్టాప్ వద్ద శనివారం ఎస్ఐ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. పత్రాలు సరిగా లేని వాహనదారులకు జరిమానా విధించారు. తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించి నిబంధనలు పాటించాలని ఎస్ఐ సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.