కడప సి. పి. బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో సహాయ పరిశోధకుడుగా పనిచేస్తున్న డా. చింతకుంట శివారెడ్డికి ఆదివారం పలమనేరులో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో తెలుగు భాషా సేవ పురస్కారం అందజేశారు. సంస్థ అధ్యక్షులు పైనేని తులసినాధం నాయుడు మాట్లాడుతూ రాయలసీమ ఆస్తిత్వం దిశగా రచనలు చేయడం ద్వారా తెలుగు భాషా సాహిత్యలకు చేస్తున్న సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు తెలిపారు.