వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్స్కు సంబంధించిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. కడప జిల్లాలోని 417 హెక్టార్ల సున్నపురాయి గనుల లీజుల కేటాయింపులో దాల్మియా సిమెంట్స్ అక్రమంగా లాభం పొందిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ చర్య తీసుకుంది. 2013లో ఇదే అంశంపై జగన్తో పాటు దాల్మియాపై CBI చార్జ్షీట్ దాఖలు చేసింది.