కడప నగర పరిధిలో ఉన్న పుట్లంపల్లి చెరువు కట్ట కింద ఉన్న తూములు యథాతథంగా కొనసాగించాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామ్మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్లంపల్లి చెరువు అభివృద్ధి పనులను ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పార్టీ ప్రతినిధి బృందం పరిశీలించింది. పుట్లంపల్లి చెరువు అభివృద్ధిని సీపీఎం పార్టీ స్వాగతిస్తోందన్నారు. తూములు పూడ్చడం ద్వారా దాదాపు 100 ఎకరాలకు చెరువు నీరు విడుదల అయ్యే అవకాశం లేదన్నారు.