తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగను పరిష్కరించుకుని మంగళవారం కడప శిల్పారామంలో సాంస్కృతిక కళా వేదిక మీద ప్రముఖ పంచాంగ కర్త చక్రవర్తుల నాగాంజనేయ శర్మ క్రోధి నామ సంవత్సర ఉగాది పంచాంగ శ్రవణం చేశారు. అనంతరం శిల్పారామం క్యాలెండర్స్ ను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, ఏవో శివ ప్రసాద్ రెడ్డి ఆవిష్కరించారు. కడప నగరానికి చెందిన వర్షిని డాన్స్ అకాడమీ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.