కడప ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ రాఘవరెడ్డి కోసం పోలీసుల మంగళవారం గాలింపు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాల్లో గాలింపు ప్రారంభించారు. కడపలో మహానాడు జరిగినప్పుడు టీడీపీ కార్యకర్తలపై రాఘవరెడ్డి హత్యాయత్నం చేశారని కేసు నమైదనట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు నుంచి పరారీలో ఉన్నాడని పోలీసు అధికారులు తెలిపారు.