కడప నగర పరిధిలో ఉన్న పుట్లంపల్లి చెరువు కట్ట కింద ఉన్న తూములు యధాతధంగా కొనసాగించాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం పుట్లంపల్లి చెరువు అభివృద్ధి పనులను ప్రజాచైతన్యయాత్రలో భాగంగా పార్టీ ప్రతినిధిబృందం సందర్శించడం జరిగింది. రామమోహన్ మాట్లాడుతూ పుట్లంపల్లి చెరువు అభివృద్ధిని సిపిఎం పార్టీ స్వాగతిస్తోందని ఆయన తెలిపారు.