కడప నగరంలోని రాజీవ్ మార్గ్, ఎర్రముక్కపల్లె జంక్షన్ వద్ద కడప వన్ టౌన్ పోలీసుల వాహనాల తనిఖీలు చేపట్టారు. శుక్రవారం సాయంత్రం ఎస్సై అమర్ నాథ్ రెడ్డి తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసిన నేపధ్యంలో ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బైక్, ఆటోలు, లగేజి వాహనాలను విస్తృతంగా పరిశీలించారు. సరిహద్దుల్లో పరిస్థితుల నేపధ్యంలో ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.