చెన్నూరు: సబ్సిడీపై 75 క్వింటాళ్లు జనుము విత్తనాలు మంజూరు

73చూసినవారు
చెన్నూరు: సబ్సిడీపై 75 క్వింటాళ్లు జనుము విత్తనాలు మంజూరు
చెన్నూరు మండలానికి ఖరీఫ్ సీజన్ 2025 గాను పచ్చిరొట్టు ఎరువు, జనుము విత్తనాలు 75 క్వింటాళ్లు మంజూరైనట్లు వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు. 10 కేజీల బ్యాగు రూ. 1090 పూర్తి ధర ఉండగా సబ్సిడీ కింద రూ. 545 రైతు వాటా కింద నిర్ణయించడం జరిగిందన్నారు. ఎకరాకు 10 కేజీలు అదనంగా 50 కేజీలు కేటాయించడం జరిగిందన్నారు. దగ్గర లోని రైతు సేవా కేంద్రాల్లో రైతులు బయోమెట్రిక్ చేయించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్