చెన్నూరు గ్రామపంచాయతీలోని ప్రజలు తమ ఇంటి పన్ను, నీటి పన్ను, తదితర పన్నులు ఆన్ లైన్ ద్వారా చెల్లించాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె చెన్నూరు పంచాయతీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు పంచాయితీకి కట్టవలసిన పన్నులను ఆన్ లైన్ వ్యవస్థ ద్వారా చెల్లించడంతో అవకతవకలకు అవకాశం ఉన్నదన్నారు. ఇంటి పన్నులు సకాలంలో చెల్లించాలని కోరారు.