కమలాపురం నియోజకవర్గం పరిధిలోని 23 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధిని ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పంపిణీ చేశారు. గురువారం కడప నగరంలోని బిల్డప్ దగ్గర ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 23 మందికి రూ 18, 37, 418 చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి చంద్రబాబు నాయుడు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు.