లారీ ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం సంజీవరాయని పేట వద్ద ఈ సంఘటన గురువారం చోటుచేసుకుంది. మృతుడు కడప జిల్లా కలసపాడు మండలం పుల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రాచకొండ రంగరాజు పోలీసుల గుర్తించారు. రోడ్డు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడు గొర్రెల వ్యాపారం చేస్తుంటాడని బంధువులు వెల్లడించారు.