కమలాపురం పట్టణ ప్రజలు తమ ఆస్తి పన్నులను ఏక మొత్తంలో చెల్లించి 50 శాతం రాయితీ మినహాయింపును పొందవచ్చని కమిషనర్ జగన్నాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 50 శాతం రాయితీని పొండేందుకు పన్నును ఏక మొత్తంలో చెల్లించేందుకు ఈనెల 30వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం గడువు ఇచ్చిందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.