వల్లూరు: ఏపీజీబీ తరలింపు అన్యాయం: ఆర్సిపి
కడపలో ఉన్న ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడం అన్యాయమని, తరలింపు ఆపకపోతే ఉద్యమాలను ఉధృతం చేస్తామని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు. శనివారం వల్లూరు మండల కేంద్రంలోని గణేష్ పురం వద్ద ఏపీజీబీ ప్రధాన కార్యాలయాన్ని ఇతర ప్రాంతాలకు తరలించడంపై ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈనెల 12వ తేదీ కడప ఐఎంఏ హాల్లో సెమినార్ నిర్వహిస్తున్నామన్నారు.