ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి క్విజ్ పోటీల్లో పీఎం శ్రీ ఆదర్శ పాఠశాల విద్యార్థులు విజేతలుగా నిలిచారు. శుక్రవారం వల్లూరు ఆదర్శ పాఠశాలలో అకాడమిక్ సబ్జెక్ట్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ బాబు బహుమతులు అందజేశారు. క్విజ్ పోటీల్లో వల్లూరు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు రన్నరప్ గా నిలిచారు.