పెండ్లిమర్రి: కవుల జయంతులు నిర్వహించాలి

70చూసినవారు
పెండ్లిమర్రి: కవుల జయంతులు నిర్వహించాలి
కడప నగరంలోని సిపి బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో రాయలసీమకు సంబంధించిన కవులు, కళాకారుల జయంతులు నిర్వహించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం పాలక మండల సభ్యులు మూల మల్లికార్జున రెడ్డి అన్నారు. శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం ఇంచార్జ్ వీసి ఆచార్య అల్లం శ్రీనివాసరావును కలిసి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. వీసి సానుకూలంగా స్పందిస్తూ వీలైనంత త్వరలో సాహిత్య సంబంధమైన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్