కుటుంబ సమస్యలతో యువతి విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మంగళవారం నిమ్మనపల్లి లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నిమ్మనపల్లి కి చెందిన మమత (23) కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో ఉన్న విషయం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.