బాత్రూమ్ లో కింద పడి మహిళకు తీవ్ర గాయాలు

82చూసినవారు
బాత్రూమ్ లో కింద పడి మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లి అమ్మ చెరువు మిట్టలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు భార్య మంజుల శనివారం బాత్రూమ్ లో కాలుజారి కింద పడింది. ఈ ఘటనలో ఆమె తలకు బలమైన గాయాలు కావడంతో పాటు ముక్కు, చెవులలో రక్తస్రావమై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు ఆమె పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్