కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో రైతులకు ఇస్తామన అన్నదాత సుఖీభవ రూ. 20 వేలు, గత నెలలో ప్రకటించిన కరువు మండలాల రైతులకు సహాయం చేయాల్సిన సహాయం వెంటనే రైతులకు అందజేసి ఆదుకోవాలని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ అన్నారు. శుక్రవారం రైతు సేవా సమితి ఆధ్వర్యంలో మైదుకూరు ఎమ్మార్వో కార్యాలయం దగ్గర నిరసన తెలిపారు. అనంతరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.