కడప జిల్లాలో నలుగురు తహసిల్దార్ లు బదిలీ అయ్యారు. మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ బి. మఠం తహసిల్దార్ దామోదర్ రెడ్డిని ఒంటిమిట్ట, ఒంటిమిట్ట తాసిల్దార్ రమణమ్మను ఖాజీపేటకు, ఖాజీపేట తహసిల్దార్ మహబూబ్ భాషను జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయానికి, గోపవరం తహసిల్దార్ జీవన్ చంద్రశేఖర్ ను ముద్దనూరుకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.