మైదుకూరులో ఎడతెరిపిలేని వర్షం

53చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కడప జిల్లా మైదుకూరులో గత రెండు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం తీవ్ర రూపం దాల్చాయి. మైదుకూరు పట్టణంలో మంగళవారం రాత్రి నుండి ఎడతెరిపిలేని వర్షం కురుస్తుంది. కాలువలు, కుంటలు రోడ్లు అన్ని జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనవసరంగా బయట తిరగొద్దని పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.

సంబంధిత పోస్ట్