దేశంలో, రాష్ట్రాలలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాజకీయాలకతీతంగా రైతులందరూ ఐక్యమత్యం కావలసిన అవసరం ఎంతైనా ఉందని రైతు సేవా సమితి కడప జిల్లా అధ్యక్షులు ఏవి. రమణ అన్నారు. శనివారం మైదుకూరు మండలం వనిపెంటలో రైతు సేవా సమితి మైదుకూరు నియోజకవర్గ నాయకుడు కోటయ్య మురళి ఆధ్వర్యంలో జరిగిన రైతు సేవా సమితి 2025వ సంవత్సర సభ్యత్వ కార్యక్రమానికి ఏవి రమణ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.