మైదుకూరు: పట్టణ హోమ్ లెస్ నిర్వాహకులపై జడ్జి ఆగ్రహం

50చూసినవారు
మైదుకూరు: పట్టణ హోమ్ లెస్ నిర్వాహకులపై జడ్జి ఆగ్రహం
మైదుకూరులోని సాయినాథపురం హోం లెస్ కేంద్రాన్ని బుధవారం మైదుకూరు జూనియర్ సివిల్ జడ్జి ఖాజా మొయినుద్దీన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హోం లెస్ సెంటర్ నిర్వహణ తీరును పరిశీలించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ విషయంలో ఎలాంటి రికార్డులు సెంటర్ నందు అందుబాటులో లేకపోవడం పట్ల జడ్జి వెంటనే సంబంధిత రికార్డులతో గురువారం కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్