సుండుపల్లి: గుడి ఆస్తిని కబ్జాదారుల నుండి కాపాడండి

58చూసినవారు
సుండుపల్లి: గుడి ఆస్తిని కబ్జాదారుల నుండి కాపాడండి
సుండుపల్లి గ్రామ పొలం సర్వే నెంబర్ 2103/4 లో 0. 40 సెంట్ల విస్తీర్ణం గల భూమిని అనాదిగా చెన్నంశెట్టిపల్లి గ్రామ ప్రజలు అక్కడ సంక్రాంతి సంబరాలు ప్రతి ఏడాది జరుపుకుంటూ కాటమరాజు గుడి నిర్మించుకుని సంబరాలు జరుపుకునేవారమని శనివారం గ్రామస్తులు తెలిపారు. భూమి నాదంటూ చెన్నంశెట్టి నారాయణ తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టు అనుమతించిందని తెలుపుతున్నాడని కనుక గుడి ఆస్తిని వారి నుంచి కాపాడాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్