పాఠశాల స్థాయి నుంచే నకిలీ వస్తువులపై విద్యార్థులకు ప్రభుత్వం అవగాహన కల్పిస్తోందని ప్రధానోపాధ్యాయుడు రఘురామయ్య అన్నారు. ప్రొద్దుటూరు మండలంలోని తాళ్లమాపురం జెడ్పీ ఉన్నత పాఠశాలలో భారతీయ ప్రమాణాల సంస్థ (బీఐఎస్) స్టాండర్డ్స్ క్లబ్ సమావేశాన్ని మంగ ళవారం నిర్వహించారు. విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ నిర్వహించి విజేతలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేశారు. అంకాల్ కొండయ్య, రమణ, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.