ప్రొద్దుటూరు అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో లలిత కోటి నామ పారాయణం నిర్వహించారు. లలితా దేవి ఉత్సవ మూర్తికి శ్రీ విద్యాపీఠం మౌన స్వామి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. 1000 మందికిపైగా మహిళలు, భక్తులు పాల్గొని లలిత కోటి నామ పారాయణం చేశారు. భక్తులకు అన్నప్రసాదం అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ కొత్తమిద్దె రఘురామిరెడ్డి, పారాయణ కమిటీ అధ్యక్షుడు బూతురు వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు.