తెలుగు బాష ఔన్నత్యాన్ని ప్రతి ఒక్కరూ దశదిశలా చాటాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డి. కె. చదువులబాబు తెలిపారు. గురువారం ప్రొద్దుటూరు స్థానిక రామేశ్వరం లోని బాలబాలికల గ్రంథాలయం ఆధ్వర్యంలో వసంత పేట మున్సిపల్ హైస్కూల్ లో జరుగుతున్న గ్రంధాలయ వేసవి విజ్ఞాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు జిరాఫీ చెస్ కోచ్ లు నాగార్జున, అరవింద్ జిరాఫీ చెస్, క్యారమ్స్, ఖోఖో నేర్పించారు.