పులివెందుల: భారీగా పట్టుబడిన బంగారం, డైమండ్స్

77చూసినవారు
పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి భారీగా బంగారం, డైమండ్స్ను పట్టుకున్నట్లు సేల్స్ టాక్స్ ఆఫీసర్స్ తెలిపారు. రాబడిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి పులివెందులకు ఫార్చూనర్ వాహనంలో ఆరు సూట్ కేసుల్లో సరైన పత్రాలు లేకుండా తరలిస్తున్న బంగారు నగలు, డైమండ్లను పట్టుకున్నట్లు సేల్స్ టాక్స్ ఆఫీసర్ జ్ఞానానంద రెడ్డి వెల్లడించారు. వాటి విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని చెప్పారు

సంబంధిత పోస్ట్