ప్రస్తుత సీజన్ లో అతిసార వ్యాధిపై ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని తాళ్లపల్లి పిహెచ్సి హెచ్ఇ షఫిఉన్నిషా బేగం సూచించారు. శనివారం వేంపల్లి హరిజనవాడలోని ప్రాథమిక పాఠశాలలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రెండు చేతులు పరిశుభ్రంగా ఉంచాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తే సమీప ఏఎన్ఎంలను సంప్రదించి సరైన చికిత్స పొందాలన్నారు.