నమ్మించి మోసగించడం జగన్ నైజం అని ఏపీ కాంగ్రెస్ మీడియా ఛైర్ మెన్ తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలోఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ
ఏరుదాటనంత వరకు ఓడ మల్లన్న. దాటాక బోడి మల్లన్న అనడం జగన్కు అలవాటు అయిందని మండిపడ్డారు. రైతు భరోసా కింద ప్రతి ఏడాది రైతు కుటుంబానికి రూ. 12, 500 ఇస్తానన్న జగన్, అధికారంలోకి వచ్చాక రూ. 5, 000 కోత పెట్టారన్నారు. మద్య నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తానని మాట తప్పారన్నారు.