కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత సోమవారం లింగాల మండలాన్ని సందర్శించనున్నట్టు పులివెందుల టీడీపీ వర్గాలు తెలిపాయి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఆమె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవితో కలిసి పర్యటించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను వారు కోరారు.