రాష్ట్రంలో పౌర సరఫరా శాఖ ద్వారా రేషన్
సరఫరా చేస్తున్న గుత్తేదారులు తక్కువ తూకాలు ఇచ్చి భారీ మోసం చేస్తున్నారని, తూకాలు తక్కువగా ఉంటే వెనక్కి పంపాలని శాసనమండలి సభ్యుడు రాంగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పులివెందుల పట్టణంలోని రేషన్ గోడౌన్ ను పరిశీలించి, అక్కడ ఉన్న బియ్యం బస్తాలను తూకాలు వేయగా ఒకటిన్నర కేజీ తూకాలు తక్కువగా వచ్చాయి. రేషన్ సరఫరా చేసే సంస్థలు తక్కువ తూకాలతో పంపడం జరుగుతుందన్నారు.