పులివెందుల ముదునూరు రోడ్డులో ఉన్న తన నివాసంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆదివారం ప్రజా దర్బార్ నిర్వహించారు. పలుచోట్ల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.