గురువారం ఉదయం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శాసనమండలి సభ్యులు భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయాలని సమావేశంలో అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.