అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పులివెందుల పట్టణంలోని రోటరీ పురం కాలనీలోని మహిళలకు అగ్ని ప్రమాదాల నివారణపై బుధవారం అగ్నిమాపక అధికారి సునీల్ కుమార్ అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరిస్తూ ప్రమాదాలను ఏ విధంగా ఎదుర్కోవాలో ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానిక మహిళలు పాల్గొన్నారు.